మునుగోడు : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ (Dharmabhiksham) జయంతి వేడుకలను ( Birth anniversary ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలోని బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహానికి సర్పంచ్ పాలకూరి రమాదేవి ,వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, ,వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ధర్మభిక్షం తెలంగాణ కార్మిక వర్గాల కోసం పోరాడిన వ్యక్తని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురిగి చలపతి,పాలకూరి యాదయ్య, మారగొని అంజయ్య గౌడ్, అయితగోనీ లాల్ బహదూర్ గౌడ్,నకిరేకంటి యాదయ్య, ఈదులకంటి కైలాష్,జాజుల స్వామి గౌడ్, అయితగోని విజయ్ పాల్గొన్నారు.