చందంపేట, డిసెంబర్ 24 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామంలో నిర్వహించిన మహాలక్ష్మమ్మ జాతరకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ రవీంద్రకుమార్ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, నాయకులు ఏర్పుల గోవిందుయాదవ్, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, రమావత్ మోహన్కృష్ణ, బెజవాడ వెంకటయ్య, సర్పంచ్ రోజా రవినాయక్, కేతావత్ శంకర్నాయక్, వడ్త్య బాలూనాయక్, కేతావత్ శంకర్నాయక్, సీత శ్రీను, పరమేశ్, ము త్యాల రాములమ్మ, రవి, ఆంజనేయులు, సైదులు పాల్గొన్నారు.