త్రిపురారం, ఫిబ్రవరి 10 : ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియచేయడం కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచందర్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, నాయకులు పామోజు వెంకటాచారి, మాధ ధనలక్ష్మీవెంకటేశ్వర్లు, ఎస్కే.దస్తగిరి, అవిరెండ్ల సైదులు, జంగిలి శ్రీనివాస్, కామర్ల జానయ్య, మద్దూరు శ్రీనివాస్, రాజారాంసింగ్, మట్టయ్య, సుశీల్నాయక్, చింతకాయల యాదయ్య, సయ్యద్, అవిరెండ్ల పండు, శ్రీకాంత్, వినోద్, నాగయ్య, వెంకన్న, వెంకట్రెడ్డి, శంకర్రెడ్డి పాల్గొన్నారు.