మిర్యాలగూడ, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్క గిరిజనుడు నడువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ ఆశయాలను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సేవాలాల్ మహారాజ్ను బంజారాలు కులదైవంగా భావించి ఆరాధిస్తారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులు అన్ని రకాలుగా ఆదుకుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ ఆంగోతు లలితాహాతీరాంనాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టిబాబునాయక్, ఎంపీటీసీలు వీరనాయక్, కుర్ర కాంతి, ఎంఈఓ బాలాజీనాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి కుర్ర కృష్ణకాంత్, నాయకులు బానావత్ సైదులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీసంత్సేవాలాల్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ, ఎన్ఎస్ఎస్ యూ నిట్ల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ బంజారాలకు ఆరాధ్యుడని అన్నారు. కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ రాంరెడ్డి, అధ్యాపకులు హాము, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఎన్. కోట య్య, జె.నరేందర్రెడ్డి, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
త్రిపురారం : సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలను డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో రూప్లాతండా, ఇస్లావత్తండా, డొంకతండా, శ్రీగణపతి ఆభయాంజనేయస్వామి ఆలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చినగోపాల్, సుజాత, గోవింద్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : ఎంజీయూ ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఎంజీయూలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎంజీయూ ఉపకులపతి ఆచార్య గోపాల్రెడ్డి ముఖ్య అథిగా హాజరై విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం క్రీడ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆల్వాల రవి, ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ మద్దిలేటి పసుపుల, కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, అరుణప్రియ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని ఖుదాభక్ష్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల సాయిబండా తండాలో సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించుకున్నారు. జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఆంబోతు సుధాకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్నాయక్, రమావత్ పాండు, కొర్ర పెంటియా,జటావత్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.