చౌటుప్పల్, మే5 : భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్ధి క్యామ మల్లేశ్దే విజయం అని మునుగోడు మాజీ ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిఫల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, హామీలను అమ లు చేయలేక రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తూ కా లం గడుపుతున్నారని మూడు నెలల్లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అర్థమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్కు అవసరమని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి ఎన్నికల ఇన్చార్జి వెంకటనారాయణగౌడ్, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, తాడూరి శిరీషాపరమేశ్, ఆలె నాగరాజు, దుబ్బాక శశిధర్రెడ్డి, లత్తాహర్పాషా, బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, నరసింహ, ఆల్మాసిపేట కిష్టయ్య పాల్గొన్నారు.