మాడ్గులపల్లి, ఫిబ్రవరి 16: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సింగం శివ చిన్నాయన సింగం అంజయ్య ఇటీవల మృతిచెందారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. త్వరలోనే పార్టీ బీమా రూ.2 లక్షలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఆయన వెంట తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు లొడంగి గోవర్ధన్, కందుల లక్ష్మయ్య, కందిమళ్ల నరేందర్రెడ్డి, వనపర్తి నాగేశ్వర్రావు, సందినేని జనార్దన్రావు, తండు నర్సింహ, శ్రీను, గడ్డం ప్రభాకర్రెడ్డి, గడ్డం శంకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మాధవీవెంకట్రెడ్డి, సైదిరెడ్డి, ఏడుకొండలు ఉన్నారు.