కోదాడ, ఫిబ్రవరి 13 : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, మన హక్కులను సాధించుకునేందుకు ఈ నెల 13న నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం సభ పోస్టర్ను విడుదల చేశారు.
ఉద్యమ సమయంలో సాగర్ నీటి విడుదలలో అన్యాయంపై కేసీఆర్ పోరాటం చేశారని, అదే తరహాలతో పోరాటానికి రైతాంగం సిద్ధం కావాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు తాము చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కేఆర్ఎంబీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు శీలం సైదులు, పచ్చిపాల వేణుయాదవ్, రమేశ్, బెజవాడ శ్రావణ్ పాల్గొన్నారు.