నల్లగొండ, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావుకు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణంలోని అమూల్యకాలనీలో జనార్దన్రావు ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడతుఊ.. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన జనార్దన్రావును కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందినట్లు గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
తనకు అన్నివేళలా అత్యంత ఆప్తుడిగా ఉన్న జనార్దన్రావు మృతదేహానికి నివాళి అర్పిస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కంట తడి పెట్టారు. ప్రమాదానికి కొన్ని గంటల ముందు జనార్దన్రావు తనతో ఉన్నాడని, ఇప్పుడు ఇలా విగతజీవిగా మారడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. జనార్దన్రావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని శ్మశాన వాటికలో నిర్వహించారు. అంతిమ యాత్రలో కాలనీవాసులతోపాటు వివిధ పార్టీల నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి జనార్దన్రావు పాడె మోశారు. నివాళి అర్పించిన వారిలో బీఆర్ఎస్ నేతలు రేగట్టె మల్లికార్జున్రెడ్డి, గోన విష్ణువర్ధన్రావు, కటికం సత్తయ్యగౌడ్, కరీం పాషా, మాలె శరణ్యారెడ్డి, చిట్ల వెంకటేశం, అభిమన్యు శ్రీనివాస్, చీర పంకజ్యాదవ్, కొండూరు సత్యనారాయణ, బోనగిరి దేవేందర్, బకరం వెంకన్న, నాగరత్నం రాజు, సహదేవ్రెడ్డి, దేప వెంకట్రెడ్డి, బీజేపీ నేతలు మాదగోని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.