నమస్తే తెలంగాణ నెట్వర్క్ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతిని శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, విగ్రహాల వద్ద ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నకిరేకల్, దేవరకొండల్లో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నేనావత్ బాలూ నాయక్ పాల్గొని జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.