దేవరకొండ: ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అర్థిక భరోసా కల్పిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 77 మంది బాధితులకు ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.18.68లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలను అదుకునేందుకు సీఎం సహాయ నిధి చెక్కులు తొడ్పడుతాయన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పున్న వెంకటేశ్వర్లు, హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, వల్లపు రెడ్డి, గోపాల్ రావు, నర్సింహా, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీశైలంగౌడ్, స్వామి, జయంత్ తదితరులు పాల్గొన్నారు.