మునుగోడు, ఏప్రిల్ 16 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులకు అమ్మితే రైతులు నష్టపోతారని చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. బుధవారం మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలన్నారు.
కేంద్రం నిర్వాహకులు రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని సరైన తేమశాతం ఉన్నచో మిల్లులకు తరలించి రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పద్మజ, ఏపీఎం డి.మైసేశ్వరరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సైదులు, సీసీ శ్రీనివాస్, ఏఈఓ నర్సింహ, గ్రామ సంఘం అధ్యక్షురాలు ఊర్మిళ, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.