తుంగతుర్తి, మే 05 : ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ తాసీల్దార్ దయానంద్ కు వినతి పత్రం ద్వారా వివరించారు. దీనిపై తాసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ రేపటి నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విట్టల్, యాకయ్య, రమేశ్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ పాల్గొన్నారు.