మునుగోడు,జనవరి,24 : యూరియా యాప్ను రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాను రైతులకు అందించాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా , రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తాసీల్దార్, వ్యవసాధికారికి మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ వికాస్ యోజన యాప్ తీసుకురావడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో పాటు ఇంటర్నెట్ సర్వర్ బిజీగా ఉండటం, భాష తదితర సాంకేతిక సమస్యలతో రైతులు యూరియాను సరైన సమయంలో పొందలేకపోతున్నారన్నారు. యాప్లో తలెత్తిన సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. సొసైటీల ద్వారా ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నరిసింహ, రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బండమీది యాదయ్య, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సురిగి చలపతి, బి.లాలు, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు సతీష్కుమార్,మండల కార్యవర్గ సభ్యులు ఈదుల కంటి కైలాష్, దుబ్బ వెంకన్న, ముంత నరిసింహ,బైరగొండ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఉదయ్కుమార్, కట్కూరి లింగస్వామి, మిర్యాల యాదయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.