కోదాడటౌన్, మార్చి 26 : కోదాడ కోర్టులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు బయట ఉన్న బీరువాలోని ప్లాస్టిక్ ట్రే పూర్తిగా కాలిపోయింది. దాంట్లో ఉన్న కోర్టుకు సంబంధించిన వివిధ పత్రాలు కాలిపోయాయి. విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా బోర్డుకు ఆనుకునే బీరువా ఉండడంతో దానికి మంట అంటుకొని, లోపల ఉన్న ట్రే వేడికి కాలిపోయింది.
ప్రమాదం జరిగిన తీరును ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాం సుందర్, పట్టణ సీఐ రాము, ఏఈ శ్రీనివాస్రావు పరిశీలించారు. కోర్టుకు మూడు రోజులు సెలవులు కావడంతో మంగళవారం కోర్టు సిబ్బంది ఈ ఘటనను గమనించింది.