మఠంపల్లి/ నేరేడుచర్ల/ గరిడేపల్లి, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ సూచించారు. మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆదివారం వారు పరిశీలించారు. చెక్పోస్టు రికార్డులను, సీజ్ చేసిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నేరేడుచర్ల, గరిడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత, కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చిల్లేపల్లి చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. వారి వెంట తాసీల్దార్లు సురిగి సైదులు, బండ కవిత, మున్సిపల్ కమిషనర్ అశోక్రెడ్డి, ఆర్ఐ రాంబాబు, బీఎల్ఓలు ఉన్నారు.