నూతనకల్, నవంబర్ 16 : వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లేదని, మీలో ఒకడిలా ఉంటున్న తనను ఆశీర్వాదించాలని ప్రజలను ఆయన కోరారు. గురువారం నూతనకల్ మండలంలోని మాచనపల్లి, పెదనెమిల, బిక్కుమళ్ల, కొత్తతండా, దిర్శనపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు డప్పులు, బ్యాండ్ మేళాలు, బైక్ ర్యాలీలుగా అలాగే మహిళలు మంగళ హారతులతో ఎదురు వచ్చి బొట్టు పెట్టి తమ గ్రామాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పారు.
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్దపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే 24 గంటల కరెంట్ ఇవ్వరని, రైతు బంధు బంద్ చేస్తారని విమర్శించారు. తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రసుత్తం రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా ఎన్నికల అనంతరం దాన్ని రూ.16 వేలకు పెంచనున్నట్లు అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం,
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. మూడోసారి కారు గుర్తుకు ఓటేసి తనకు ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు కుందెన అమ్మక్కాభద్రాచలం, నాయకలు కప్పల రాంమ్మూర్తి, ఏర్పుల లింగయ్య, కుందెన సుధాకర్, అయోధ్య, మల్లయ్య, రాజేశ్ ఎడ్ల శ్రీను, యాస సోమిరెడ్డి, వనం శ్రీను పాల్గొన్నారు.
నాగారం : ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శుక్రవారం నాగారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఫణిగిరి, మామిడిపల్లి, డి.కొత్తపల్లి, నాగారం బంగ్లా గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతి నిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.