నల్లగొండ రూరల్, నవంబర్ 25 : బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలంగా మారయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి మండలంలోని గ్రామాల్లో గల చెరువులు నింపుతానన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామంలో రూ. కోటి పైగా నిధులు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు.
నల్లగొండ నియోజకవర్గాన్ని ఇప్పటికే రూ.1,400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి మరింత చెందుతుందన్నారు. 20 ఏళ్లుగా ఇకడ ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని, ఇకడ ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రైతులు, మహిళలు, యువత, వృద్ధులు ఇలా ప్రతి ఒకరు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకవస్తే పాత పథకాలు యధావిధిగా కొనసాగించడంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ లక్ష నుంచి రెండు లక్షలకు, ఆసరా పింఛన్ రూ. 5 వేలకు ప్రభుత్వం పెంచనున్నట్లు చెప్పారు. పేదవాడి కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ అలోచనలు చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కడుపులు నింపుతున్నారన్నారు.
కానీ కాంగ్రెస్కు అధికారం ఇస్తే పేదోని కడుపు నింపడం కాదు స్కాంల పేరుతో వారి కడుపులు కోడతారని అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి గెలిస్తే పదవి అడ్డం పెట్టుకుని ఖాళీ జాగాలు లేకుండా కబ్జా చేస్తారని అన్నారు. ఇండ్లు, ఖాళీ జాగాలు కబ్జాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, అభివృద్ధ్ది అలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మండలంలోని కంచనపల్లి, దీపకుంట, కాకుల కొండారం, దొనకల్లు, కుదావన్పూర్ ,చెన్నుగూడెం, గుండ్లపల్లి గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికి మద్దతు పలికారు. మహిళలు బొట్టు పెట్టి హారతిచ్చి మరోసారి భూపాలన్నకే ఓటు అని నినదిస్తూ కారు గుర్తుకు ఓటేస్తామని ప్రకటించారు. ఆయా కార్యక్రమాలలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్, సర్పంచులు మన్నె కృష్ణార్జున్ రెడ్డి, చింతపల్లి జయమ్మ , వెంకటేశ్వర్లు, దూదిపాల జాన్ రెడ్డి, గుండెబోయిన శ్రీలత, పంతంగి సరిత, వీరమల్ల జానకమ్మ, రాజుపేట మల్లేశ్గౌడ , మాజీ వైస్ ఎంపీపీ నారబోయిన భిక్షం, గుండెబోయిన జంగయ్య, కాసర్ల విజయ రెడ్డి, శ్రీనాథ్ ,వెంకటగిరి , కొప్పోలు విమలమ్మ, డాక్టర్ సుహాస్, హరీశ్ గౌడ్, నర్సిరెడ్డి, ఎన్న అశోక్ రెడ్డి పాల్గొన్నారు.