నల్లగొండ సిటీ, మార్చి 23 : చాలెంజ్గా తీసుకుంటే సాధించలేనిదేమీ లేదని, ఉద్యోగులు, సిబ్బంది తమ విధులు బాధ్యతగా నిర్వర్తిస్తే ఆర్టీసీ అన్ని విధాలా ముందుకెళ్తుందని ఆ సంస్థ ఈడీ పురుషోత్తం అన్నారు. నల్లగొండ రీజియన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు శుక్రవారం అవార్డులు అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎంపీఎల్ వచ్చేలా డ్రైవర్లు కృషి చేయాలని, ప్రతి ఉద్యోగి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు శాయశక్తులా పని చేయాలని అన్నారు. కార్యక్రమం లో ఆర్ఎం శ్రీదేవి, ఆర్ఎంఓ మాధవి, శివశంకర్, డీఎంలు రాంమోహన్రెడ్డి, పాల్, సిబ్బంది పాల్గొన్నారు.