నల్లగొండ రూరల్, జనవరి 8 : అట్టడుగున ఉన్న వెలమ బంధువులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిల భారత వెలమ సంఘం (ఏఐవీఏ) అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమనేని పాపారావు కోరారు. ఇటీవల ఏఐవీఏ అధ్యక్షుడిగా ఎన్నికై సందర్భంగా నల్లగొండ డ్వాబ్ ప్రధాన కార్యదర్శి ,ఆహ్వాన కమిటీ నిర్వాహకులు జిల్లా కేంద్రంలోని సూరదాస్ భవన్లో నిర్వహించి అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లాలో వెలమ సంఘ కార్యవర్గం లేకపోయినప్పటికీ అభినందన సభ నిర్వహించడం సంతోషకరమన్నారు. జిల్లాలో త్వరలో వెలమ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వెనుకబడిన వెలమ బంధువులకు చేయూతనివ్వాలని సూచించారు. అనంతరం పొనుగోటి చొక్కారావు నేతృత్వంలో నల్లగొండ వెలమ బంధువులు పాపారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గోమతి బొంత సభాధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తీగల మంజుల, పొనుగోటి దేవేందర్రావు, సందినేని జనార్దన్ రావు, నాగులవంచ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.