గుర్రంపూడ్ : నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్( BRS ) పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ( NRI ) నాగులవంచ నరసింహారావు ( Narasimha Rao ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, సర్పంచ్ జాల యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని తాగునీరు దాహార్తిని తీరుస్తుందని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీ ధనంజయ్, సర్పంచులు సింగం బాలకృష్ణ, పిల్లి ఉమారాణి అభినయ్, సల్వాది సత్యవతి నగేష్, మాజీ సర్పంచ్ బచ్చనబోయిన శ్రీనయ్య, ఉప సర్పంచ్ కోట్ల సుప్రియ శ్రీనాథ్, పార్టీ నాయకులు రామగిరి చంద్రశేఖర రావు, నాగులవంచ పరశురామ్ రావు, కామల్ల రాములు, నాగులవంచ లక్ష్మీ నారాయణ రావు,కూనూరు సైదిరెడ్డి, నాగులవంచ నాగేశ్వరరావు, మేకల వెంకట్ రెడ్డి, గంటేల శంకర్, ఇనుపాముల రామారావు, కట్టెబోయిన రాంబాబు, షేక్ మొహిన్,షేక్ సిరాజ్ ,జాల నరసింహ,బొమ్ము నాగరాజు, భూపతిరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.