చందంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం నేరేడుగొమ్ము మండలంలోని పేర్వాల గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మరేఖ్యతండాలో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్ను ప్రారంభించారు. పేర్వాల గ్రామంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి నెలా పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మాహన్మానాయక్, జడ్పీటీసీ కేతావత్ బాలు, ఎంపీడీఓ ఝాన్సీబాయి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, వైస్ ఎంపీపీ ఆరెకంటి రాములు, బైరెడ్డి కొండల్రెడ్డి, ఎంపీటీసీలు సరోజ, సంతోష్, వాంకుణావత్ బిక్కు, సర్పంచులు ఎస్కె. ఖతీజాబషీర్, కేతావత్ సీతారాం, రవీందర్, వడ్త్య బాలు, పల్స వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, కుంభం నరేశ్గౌడ్, చెన్న, దూడ, బావోజి, భరత్, ముక్కమల సాయన్న, నాగునాయక్, చెన్నకేశవులు, పేర్వాల వెంకటయ్య పాల్గొన్నారు.