కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి చేసి గింజలు పెట్టడం పూర్తి చేయాలని సూచించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో 3లక్షల 33వేల మొక్కల పెంపంకమే లక్ష్యంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు.
అయిటిపాముల, రామచంద్రపురంలో బ్యాగ్ ఫిల్లింగ్ తక్కువగా ఉన్నందున్న ఆయా గ్రామాల టీఏలు, పంచాయతీ కార్యదర్శులపై అగ్రహం వ్యక్తం చేసి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని లేని చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పోరేళ్ల సునీత, ఎంపీఓ మహ్మద్ అర్థర్ పర్వేజ్, ఏపీఎం చౌగోని వినోద, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.