10th results | నేరేడుచర్ల, మే 10 : పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతోపాటు వారి తల్లిండ్రుల్లో కంగారు ఉండటం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో.. తమకు ఏ గ్రేడ్ వస్తుందో.. అని విద్యార్థులు టెన్షన్ పడటం సాధారణమే. కానీ, పరీక్షల ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందవద్దని, రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా స్పందించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చాయని, చదివిన చదువుకు తగిన గ్రేడ్ రాలేదని అతిగా స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క ఓటమితోనే తమ చదువు ముగిసిపోదని, ఉత్తమ గ్రేడ్ రాగానే హీరోలైపోరని గుర్తించాలంటున్నారు.
పాసైనా, ఫెయిలైనా, మార్కులు, గ్రేడ్లు ఎలా వచ్చినా పాజిటివ్గా తీసుకుని ధృడంగా ఉన్నవారే నిజమైన విజేతలని పేర్కొంటున్నారు. పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారికి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచిస్తున్నారు. ఈ నెల 9న విడుదలైన ఇంటర్, 10న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు కొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు. అది చాలా తప్పని, పాసైతేనే జీవితం, ఫెయిలైతే జీవితంలో ఎదుగలేం అనే ఆలోచనను విరమించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కసారి ఓటమి మన విజయానికి నాంది అనుకోవాలని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులు జీవితాంతం బాధపడేలా చేయకూడదంటున్నారు.
తల్లిదండ్రులు, స్నేహితులు అండగా నిలువాలి
పదో తరగతి విద్యార్థుల వయస్సు పూర్తిగా పరిణితి చెంది ఉండదు. పాసైనా, ఫెయిలైనా అతిగా స్పందిస్తుంటారు. ఇందులో పాసైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. మార్కులు, గ్రేడ్లు ఎక్కువ, తక్కువ వచ్చాయన్న చిన్నపాటి సమస్యలే ఉంటాయి. కానీ, ఫెయిలైతే మాత్రం సున్నిత మనసులు క్షణికావేశంలో ఒక్కోసారి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి సమయంలోనే వారికి తల్లితండ్రులు, స్నేహితులు, అధ్యాపకులు అండగా నిలువాలి. జరిగిన దానికి బాధపడకుండా భవిష్యత్తు బాగుంటుందన్న దిశగా వారికి గైడెన్స్ ఇవ్వాలి. ఓటమితోనే గెలుపు బాట వేసుకోవాలంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాలి.
ఈ విషయాలను మరువద్దు