మఠంపల్లి, నవంబర్ 28 : దళితుల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకం తెస్తే కొందరు ప్రతిపక్ష నాయకులు అమాయకులను రోడ్లపైకి తెచ్చి పథకం విచ్ఛిన్నానికి చూస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య మండిపడ్డారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితబంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
దళిత బంధు పథకాన్ని అపహాస్యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుపేదలైన వారిని గుర్తించి దళితబంధు పథకాన్ని అందించి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మట్టపల్లి, టీఆర్ఎస్ నాయకులు దేవపంగు అచ్చయ్య, అల్లీపురం ఉపసర్పంచ్ సీహెచ్.రాజీవ్, నాగబాబు, నరేందర్, ఆరాల నాగరాజు, దేవపంగు ప్రసాద్, వీరస్వామి, ఇరుగు ప్రభు పాల్గొన్నారు.