రామగిరి, జనవరి 25 : 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు అధికారులు సిద్ధం చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ హరిచందన జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు హాజరు కానున్నారు.
ఉదయం 9 గంటలకు ఆమె జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 9:15 గంటలకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కలెక్టర్ తన ప్రసంగంలో వివరిస్తారు. 9:30 గంటలకు బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. 9:50 గంటలకు ఆస్తుల పంపిణీ, 10గంటకు ప్రశంసా పత్రాల ప్రదానం, 10:30 గంటలకు జాతీయ గీతాలాపన ఉంటుంది. అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో వి విధ శాఖల అధికారులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. వేడుకల కోసం పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది.