నీలగిరి, ఫిబ్రవరి 14 : జిల్లా అదనపు ఎస్పీగా బి.రాములునాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీగా పని చేస్తున్న రాములునాయక్ను నల్లగొండకు బదిలీ చేసింది. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో ఆయన ఎస్ఐ, సీఐ, నల్లగొండ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు పలువురు సీఐలు, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
నల్లగొండ డీఎస్పీగా కొలను శివరాంరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. శివరాంరెడ్డి 1998 బ్యాచ్లో ఎస్ఐగా సెలెక్ట్ట్ అయి కనగల్ మండలంలో తొలిసారిగా ఎస్ఐగా పనిచేశారు. అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఐ, సీఐగా పనిచేశారు. నార్కట్పల్లి సీఐగాఉన్నప్పుడు డీఎస్పీగా పదోన్నతి పొంది రాచకొండ కమిషనరేట్కు బదిలీ అయి యాదాద్రి డివిజన్లో పనిచేశారు. అక్కడి నుంచి నల్లగొండ డీఎస్పీగా వచ్చారు.
మిర్యాలగూడ : పట్టణ టూటౌన్ సీఐగా పిన్నెని నాగార్జున బుధ వారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎ.నర్సింహారావు హైదరాబాద్ రేంజ్ కార్యాలయానికి బదిలీపై వెళ్లగా అక్కడ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్న నాగార్జునను ఆయన స్థానంలో నియమిస్తూ ఉన్నతా ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారిగా కందికొండ నర్సింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ పీడీగాఉన్న కృష్ణవేణి బదిలీపై యాదాద్రిభువనగిరికి వెళ్లడంతో ఆమె స్థ్ధానంలో సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారిగా ఉంటూ అవంతీపురం బధిరుల పాఠశాలలో స్పెషల్ ఆధికారిగా పనిచేస్తున్న ఆయనను నల్లగొండకు బదిలీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మహిళ, శిశువు, వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.
నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా సంపత్కుమార్ను నియమిస్తూ మున్సిపల్ శాఖ అధికారులు బుధవారంఉత్తర్వులు జారీ చేశారు. సంపత్కుమార్ ప్రస్తుతం సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు రానున్నారు. రెండేళ్ల క్రితం నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా వచ్చిన డాక్టర్ కేవీ రమణాచారి డిసెంబర్లో వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో పబ్లిక్ హెల్త్ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు ఇన్చార్జ్గా పనిచేశారు. తరువాత నల్లగొండ ఆర్డీఓ రవి ఆదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీల్లో సిద్దిపేట కమిషనర్గా ఉన్న సంపత్కుమార్ను నల్లగొండకు బదిలీ చేశారు. అలాగే నల్లగొండలో ఆదనపు కమిషనర్గా ఉన్న సయ్యద్ ముసాబ్ అహ్మద్ జల్పెల్లికి బదిలీ చేశారు.
చిట్యాల : చిట్యాల మున్సిపల్ కమిషనర్గా పి. వీరేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు మేనేజర్ నుజ్రహత్ఫాతిమా తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక సంఘం నుంచి వీరేందర్ బదిలీపై చిట్యాలకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.
చందంపేట : చందంపేట తహసీల్దార్గా ఎం.శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీ కరించారు. గతంలో ఇక్కడ పని చేసిన రాములు అందుగులకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో నాగర్కర్నూల్ జిల్లాలో ఏఓగా పని చేస్తున్న ఎం.శ్రీనివాసులు తహసీల్దార్గా చందంపేటకు బదిలీపై వచ్చారు.
కట్టంగూర్: కట్టంగూర్ తాసీల్దార్గా గుగులోతు ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తాసీల్దార్గా పని చేసిన డొంకెన స్వప్న తిప్పర్తి బదిలీ కాగా ఆమె స్థానంలో నకిరేకల్లో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ బదిలీపై కట్టంగూర్ వచ్చారు.
చిట్యాల : చిట్యాల మండల తాసీల్దార్ జి. కృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తాసీల్దార్ దశరథ బదిలీపై చండూర్కు వె ళ్లారు. జనరల్ ఎలక్షన్స్ 2024 సందర్భంగా ఈసీఐ ఆదేశాల మేరకు బదిలీలు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
నార్కట్పల్లి : నార్కట్పల్లి తాసీల్దార్ వెం కటేశ్వర రావు బుధవారం బాధ్యతలు స్వీకరి ంచారు.మల్కాజ్గిరి ఆర్డీఓ కార్యాల యంలో డీఏఓగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చా రు. ఇక్కడ పనిచేస్తున్న తాసీల్దార్ పద్మ కనగ ల్కు బదిలీపై వెళ్లారు.
శాలిగౌరారం: శాలిగౌరారం తాసీల్దార్గా ఎండీ అన్వర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన పాల్సింగ్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
నల్లగొండ సిటీ: కనగల్ ఎంపీఓగా సుమలత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎంపీఓగా పని చేసిన ముజీబుద్దీన్ నల్లగొండకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మునుగోడులో పని చేస్తున్న సుమలత ఇక్కడకు బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
(సాగర్)ఎస్ఐగా వి.నారాయణరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండలోని సీసీఎస్లో పనిచేస్తున్న నారాయణరెడ్డి మండలానికి బదిలీకాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వి.సురేశ్ నల్లగొండ టూటౌన్ ఎస్ఐగా బదిలీపై వెళ్లారు.