పర్యావరణహిత పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుకవ్రారం ఆయా వార్డుల గణేష్ ఉత్సవ కమిటీలకు 5 అడుగుల మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతలో సూర్యాపేట జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, ప్లాస్టిక్ నివారణలోనూ ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలువాలని ఆకాంక్షించారు. కాలుష్య నివారణకు మట్టి వినాయక విగ్రహాలు మంచిదని తొమ్మిదేండ్లుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మట్టి వినాయక విగ్రహాలను ఉత్సవ కమిటీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సూర్యాపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.15 లక్షల వ్యయంతో ఐదు ఫీట్ల ఎత్తు గల 156 మట్టి వినాయక విగ్రహాలను ఆయా వార్డుల గణేశ్ ఉత్సవ కమిటీలకు శుక్రవారం మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. తడి, పొడి చెత్త సేకరణలో సూర్యాపేట మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ప్లాస్టిక్ నివారణ విషయంలో కూడా మనమే ముందుండి అందరికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, విగ్రహాలకు వాడే రంగులు, కెమికల్స్తో నీటి కాలుష్యం ఏర్పడి జీవరాశులు అంతరించిపోవడమే కాకుండా ఆ నీళ్లతో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు చెప్పారు.
క్యాన్సర్కు ప్రధాన కారణం ప్లాస్టిక్ అని ఇది గాలి, నీరు, భూమి దేన్నైనా కలుషితం చేస్తుందన్నారు. కాలుష్య నివారణకు మట్టి వినాయక విగ్రహాలు మంచిదని అందుకే సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి మంత్రి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు .