కోదాడ, జూన్ 19 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడం హర్షణీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినయ్, కోదాడ మాజీ సర్పంచ్ వెంకటరత్నంబాబు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 15వ వార్డులో మండల పరిషత్ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు అజీమ్ ఆధ్వర్యంలో బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దానగుణం కలిగి ఉన్న అజీమ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, కోదాడ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజాన్, మాజీ కౌన్సిలర్లు, షాబుద్దీన్, షఫీ, పాఠశాల హెచ్ఎం భూపాల్రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ విజయ్ పాల్గొన్నారు.