ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం (డీడీఎన్) కింద అర్చకులకు ఇస్తున్న రూ.6వేలను రూ.10వేలకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మంగళశారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ 128 జీఓను విడుదల చేశారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీడీఎన్ఎస్ పథకంలో కొనసాగుతున్న 685 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
– రామగిరి, ఆగస్టు 29
ఆధ్యాత్మికతతోనే ధర్మం విలసిల్లుతుందని నమ్మి, ఆ దిశగా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. పురాతన ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం (డీడీఎన్) కింద గత పాలకులు రూ.2500 అందించగా.. దానిని రూ.6వేలకు పెంచి అర్చకులకు ఆర్థిక భరోసా కల్పించారు. అర్చకుల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని మే 31న బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు వేతనాలు పెంచాలని సర్కారు నిర్ణయించగా.. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ మంగళవారం 128 జీఓను విడుదల చేశారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీడీఎన్ఎస్ పథకంలో కొనసాగుతున్న 685 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తూ నల్లగొండలో మంగళవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
యజ్ఞ యాగాదులు, దేవాలయాల నిర్మాణాలతో సనాతన ధర్మాన్ని కాపాడుతూనే అన్ని మతాలు గౌరవించేలా సీఎం కేసీఆర్ ఆయా మతాలు, వర్గాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక భావం విలసిల్లేలా మత సామరస్యాన్ని కాపాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. స్వరాష్ట్రంలో దేవాలయాలతోపాటు సర్వమత ప్రార్థన మందిరాలు నిత్యం ఆధ్యాత్మికతతో విలసిల్లుతున్నాయి.
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన ఆలయాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ధూప, దీప, నైవేద్య పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,675 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల గౌరవ భృతిని తాజాగా రూ.10వేలకు పెంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ధూప, దీప, నైవేద్య పథకం దేవాలయాలతోపాటు జూన్ 20న తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో 290 దేవాలయాలకు ఈ పథకం వర్తింపజేస్తూ అర్చక నియామక ఉత్తర్వులు అందజేశారు. దీంతో నల్లగొండలోని ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ పరిధిలో డీడీఎన్ఎస్లో 685 దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఇక నుంచి రూ.10వేల గౌరవ వేతనం అందనుంది.
నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. దేశంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ బ్రాహ్మణులకు గౌరవం కల్పించారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 685 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల గౌరవ భృతిని రూ.10వేలకు పెంచి భరోసా కల్పించారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బ్రాహ్మణులంతా రుణపడి ఉంటారు.
– దౌలతాబాద్ వాసుదేవశర్మ, డీడీఎన్ఎస్ పథకం
బ్రాహ్మణుల పూర్తి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయిసంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్కు రూపకల్పన చేసి.. శిథిలమైన గ్రామీణ దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం అమలుతో పేద బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్. అర్చకులకు రూ.10వేల గౌరవ భృతి అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అందించేలా జీఓ 128ని విడుదల చేయడం సంతోషకరం. నిష్టతో ఉన్న ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతున్నా.
– పెన్నా మోహనశర్మ, డీడీఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. కాంగ్రెస్ పాలనలో దేవుడి ధూప, దీప, నైవేద్యం కోసం ఆలయ అర్చకులు దాతల కోసం ఎదురు చూడాల్సి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ డీడీఎన్ఎస్ కింద ఆలయానికి రూ.6వేలు ఇచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తాజాగా రూ.10వేల వేతనం ప్రకటించడం హర్షణీయం. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రికి అర్చకులు రుణపడి ఉంటారు.
– గొట్టిముక్కుల నర్సింహాచార్యులు, అర్చక సంఘం మండల కన్వీనర్, అనుముల
రామగిరి, ఆగస్టు 29 : ధూప, దీప, నైవేద్య పథకం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు అందించే గౌరవ భృతిని రూ.10వేలకు పెంచడాన్ని హర్షిస్తూ నల్లగొండలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మునుగోడు రోడ్డులోని షిర్డీ సాయిబాబా దేవస్థానంలో డీడీఎన్ఎస్ అర్చకుడు పర్వతం రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలు చేసి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వేతనం పెంచి తమ కుటుంబాల్లో ఆనందం నింపారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీడీఎన్ఎస్ అర్చకులు బెజ్జంకి నవీన్శర్మ, గాదె మురళీశర్మ పాల్గొన్నారు.