దేవరకొండ, డిసెంబర్ 23: అభివృద్ధే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వైకుంఠ రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేవరకొండ మున్సిపాలిటీని సుందరీకరణగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, వైస్ చైర్మన్ రహత్అలీ, వడిత దేవేందర్నాయక్, రైస్, జయప్రకాశ్నారాయణ, కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, కృష్ణ, రాములు, కొండల్రెడ్డి పాల్గొన్నారు.
నేడు చింతపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
మాల్, డిసెంబర్ 23 : చింతపల్లి మండలంలో శనివారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుర్మేడు గేట్ నుంచి బ్రావణపల్లి వరకు ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, గొల్లపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.