దేవరకొండ రూరల్: దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని రూ.1.15 కోట్లతో చేపడుతున్న నూతన కాంపౌడ్షెడ్ ప్రహరీ గోడ డీఆర్పీసీలకు ఎమెల్యే రవీంద్రకుమార్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ప్రతి నెలా మున్సిపాలి టీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిం దన్నారు. ప్రణాళికాబద్దంగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. త్వరితగతిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుంద ని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయని ఆయన కొనియాడారు.
గజ్వేల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని ఆయన అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహా, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహ త్అలీ, కమిషనర్ వెంకటయ్య, హన్మంతు వెంకటేశ్గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సుల్తానా, మహమ్మద్ రైస్, జయప్రకాశ్, నారాయణ, ప్రదీప్, అశోక్, గోపాల్, లింగయ్య, కృష్ణ, పటేల్, తౌఫిక్, రాజు, బాబా, సోపీ పాల్గొన్నారు.