దేవరకొండ: హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి అన్ని విధాలుగా అదుకుం టామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైత్ర తల్లి దండ్రులకు రూ.4 లక్షలు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చందంపేట మండలంలోని నక్కలగండికి చెందిన చైత్ర తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరని అన్నారు. ప్రభుత్వం చైత్ర కుటుంబానికి రూ.20 లక్షలు అందజేసిందని, ముఖ్యమంత్రితో మాట్లాడి కుటుంబానికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
నక్కలగండి ప్రాజెక్టులో భూములు కొల్పోయి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లగా అక్కడ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన వంతుగా రూ.లక్ష ఇవ్వగా, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు సహాకారంతో నాలుగు లక్షలు పోగు చేసి అందించినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీలు మారుపాకుల అరుణగౌడ్, బాలునాయక్, రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్ గౌడ్, ఎంపీటీసీ లక్కిదాసు, మండలాధ్యక్షుడు టీవీ ఎన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్నాయక్, వైస్ చైర్మన్ రహత్అలీ, మండల రైతు సంఘం అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పున్న వెంకటేశ్వర్లు, పొన్నబోయిన సైదులు, వల్లపు రెడ్డి, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.