దేవరకొండ రూరల్: జాతీయ స్థాయి క్రీడాకారులు దేవరకొండకు రావటం గర్వంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం స్థానిక పెంచికల్పహాడ్ ఔట్డోర్ స్టేడియంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఔట్డోర్ స్టేడియం, స్టేడియంకు కావల్సిన అన్ని వనరులు సమకూర్చుతాన ని, క్రీడాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. టోర్నమెంట్లో ప్రథమ బహుమతి నల్లగొండ, ద్వితీయ ఖమ్మం, తృతీయ మేడ్చల్ జట్లు గెల్చుకున్నాయి.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ అరుణగౌడ్ శిరందాసు కృష్ణయ్య, ముత్యాల సర్వయ్య, కౌన్సిలర్ జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్, కోశాధికారి కృష్ణకిశోర్, అమర్, నిరంజన్, తాళ్ల సురేశ్, అసోసియే షన్ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.