దేవరకొండ రూరల్, నవంబర్ 5 : అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐకి చెందిన 200 కుటుంబాలు, బద్యానాయక్తండా పంచాయతీ పరిధిలోని తెల్లావులతండా నుంచి 100 కుటుంబాలు, కమలాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు పలువురు ఆదివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేసీఆర్ చేపట్టిన సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాల నుంచి భారీగా బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీల్యానాయక్, జడ్పీటీసీ సలహాదారు మారుపాక సురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, ఎంపీటీసీ బద్యానాయక్, హన్మంత్ వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.