నేరేడుగొమ్ము(చందంపేట), మార్చి 9 : అంబా భవానీ లిఫ్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునిగల్ పరిధిలో గల గోపాలస్వామి (గురునానక్) ఆలయంలో బావోజీలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబా భవానీ లిఫ్టు పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ లిఫ్టు పూర్తయితే చిన్నమునిగల్, పెద్దమునిగల్, బచ్చాపురం, బుగ్గతండా, మోసంగడ్డతండాల్లో సుమారు 3వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. గోపాలస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో పూజారి కేతావత్ పూల్సింగ్ బావోజీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముక్కామల వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ కొండ్రపల్లి శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీలు బిక్కూనాయక్, యుగేంధర్రెడ్డి, వెంకటయ్య, పాపానాయక్, రాంసింగ్నాయక్, హరికృష్ణ, నాయకులు సుజిత్యాదవ్, సుభాశ్నాయక్, సోమాణినాయక్, యాదయ్య, బాబురాం, రమేశ్నాయక్, జైపాల్సింగ్, రూప్లానాయక్, మకట్లాల్ పాల్గొన్నారు.