దేవరకొండ: మేధావుల సృష్టించేవి గ్రంథాలయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పరి ధి చింతకుంట్ల గ్రామంలో రూ.8.50 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేం దుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గోపాల మిత్ర భవనాన్ని ప్రారంభించారు. రూ.5.50లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, మండల రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచ్లు కుంబం శ్రీనివాస్ గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ దూది పాల వేణుధర్రెడ్డి, సర్పంచ్ రుద్రమ్మ, పసునూరి యుగేంధర్రెడ్డి, ఎంపీడీవో బాలరాజ్రెడ్డి టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దశ్రునాయక్, పీఆర్డీఈ జీవన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.