దేవరకొండ: మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడవచ్చునని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆన్నారు. కరోనా దృష్ట్యా ప్రజలంతా భౌతిక దూరం పాటించి, మాస్కులు తప్పని సరిగా వాడాలని సూచించారు.
నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాక్షించారు. పూజల వద్ద గుంపులుగా ఉండొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహా, మండల రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహత్అలీ, నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, కమిషనర్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, పొన్నబోయిన సైదులు, కౌన్సిలర్ జయప్రకాశ్ నారాయణ, తౌఫిక్ అలీ, వేముల రాజు, చిత్రం ప్రదీప్ బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.