దేవరకొండ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలంలోని కుర్మెడు గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు 20 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలో కార్యకర్తలు భాగ్యస్వాములు కావాలని రవీంద్రకుమార్ సూచించారు.
పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యుడు వెంకటంపేట జంగయ్య, ముద్దం శివ, గౌని శ్రీకాంత్ గౌడ్, కుంభం మహేశ్, నదారి శ్రీకాంత్, ఇమ్రాన్, వర్కాల శ్రీకాంత్ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షడు దొంతం శేఖర్రెడ్డి, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ గోపిడి కృష్ణరెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్రావు, ఉజ్జిని నరేందర్రావు, మాస భాస్కర్, ఎంపీటీసీ కుంబం శ్వేతగౌడ్, అండేకార్ అశోక్, నిరంజన్, రమేశ్, కృష్ణయ్య, వెంకటయ్య ఉన్నారు.