దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఉందని నూతనంగా పాలటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నల్లగొండ, నాగర్కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలకు డిండి మండల కేంద్రం అనువుగా ఉంటుందని కళాశాల ను మంజూరు చేయాలని ఆయన కోరారు. పర్యాటకులకు డిండి ప్రాజెక్టు ఉన్నందున విద్యార్థులకు వ్యవసాయ కళాశాల ను అందుబాటులోఉంటే వ్యవసాయంపై మరింత ప్రయోజనం ఉంటుందని ఆయన కోరారు.