దేవరకొండ: గ్రామ, పట్టణ కమిటీలు 95 శాతం పూర్తయ్యాయని దేవరకొండ ఎమెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2న జెండా పండు గను చేసుకొని ప్రతి గ్రామంలో కమిటీలను వేసేందుకు ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలో పేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ల పిలుపు మేరకు చేపట్టిన కమిటీలు చివరి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రామ, పట్టణ కమిటీలు పూర్తి కాగానే అనుబంధ సంఘాలు పూర్తి చేయనున్నట్లు రవీం ద్రకుమార్ తెలిపారు. అనంతరం పార్టీ నిర్మాణ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో 95శాతం కమిటీలు పూర్తి కావడంతో పనిచేసిన నాయకులకు కృతజ్జతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, బాలునాయక్ మండల రైతుబంధు అధ్య క్షుడు శిరందాసు కృష్ణయ్య, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, సర్పంచ్లు మల్లారెడ్డి, యుగంధర్రెడ్డి, రైస్, జయప్రకాశ్ నారాయణ, లోకసాని తిరుపతయ్య, పొన్నబోయిన సైదులు, బొడ్డు గోపాల్, శ్రీనునాయక్, ఎంపీటీసీ పాల్గొన్నారు.