చందంపేట, ఫిబ్రవరి 18 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని గాగిళ్లాపురంలో ఆదివారం జరిగిన మహాగణపతి నవగ్రహ, కనకదుర్గ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, కేతావత్ శంకర్నాయక్, మాధవరం జనార్దన్రావు, రాఘవాచారి, మాజీ సర్పంచ్ గంగిడి కొండల్రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, తులసిరాం, వడ్త్య బాలు, మహేశ్, రామకృష్ణ, బిజిలి సుధాకర్ పాల్గొన్నారు.