దేవరకొండ: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం ఏపూర్తండా గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ దూదిపాల రేఖ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంబం శ్రీనివాస్గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దశ్రునాయక్, సర్పంచ్ కళావతి, తులసీరాం, రమావత్ శ్రీను, శ్రీనివాస్ యాదవ్, మాడ్గుల యాదగిరి, లాలునాయక్ తదితరులున్నారు.