దేవరకొండ: అన్ని విఘ్నాలు తొలగి తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధించాలని గణనాథున్ని వేడుకున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరొనా మహమ్మారి అనే విఘ్నం తొలగిపోవాలని , ఆ గణేశుడి దీవెనలతో మనం చేసే అన్ని కార్యక్రమాల్లో మంచి జరుగాలని ఆయన కోరుకున్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, కౌన్సిలర్ జయప్రకాశ్ నారాయణ, సర్పంచ్ శ్రీనునాయక్, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.