మునగాల, జనవరి 6 : మండలంలోని బరాఖత్గూడెం గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాళ శ్రీనివాసాచార్యులు, ప్రశాంతాచార్యులు పూర్ణకుంభంతో ఆయకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ చరిత్రను వివరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తన సన్నిహితులకు ఇచ్చిన హామీ మేరకు స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు ప్రజలకు ఎళ్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి ఆలయానికి వస్తున్నాడని తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ముఖ్య నాయకులతో వెళ్లి ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఎంపీపీ ఎలక బిందూనరేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణరెడ్డి, కోదాడ మాజీ ఎంపీపీ వంగవేటి రామారావు పాల్గొన్నారు.