నల్లగొండ, డిసెంబర్ 29 : మూడేండ్ల క్రితం రూ.900 కోట్లు ఉన్న డీసీసీబీ టర్నోవర్ ప్రస్తుతం రూ.2,030 కోట్లు దాటిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా పీఏసీఎస్, ఎఫ్ఎస్సీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే డీసీసీబీ, పీఏసీఎస్లలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా 5వ తేదీలోగా వేతనాలు అందిస్తున్నామని, ఉద్యోగాల్లో కూడా 20 శాతం కోటా కల్పించినట్లు తెలిపారు.
వెయ్యి మందికి పైగా విద్యార్థులకు విద్యా రుణాలు అందించి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పించినట్లు చెప్పారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పటిష్టమైన ప్రణాళికతో డీసీసీబీల బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. అనంతరం డీసీసీబీ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. సమ్మేళనంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్, ఎఫ్ఎస్సీఎస్, బీఆర్ఎస్కేవీ గౌరవాధ్యక్షుడు రూప్సింగ్, రాష్ట అధ్యక్షుడు రమేశ్బాబు, మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు శేఖర్గౌడ్, కార్యదర్శి రమేశ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, శ్రీనివాస్రావు, రాష్ట్ర నాయకులు రాజు, శంకర్, సాయిరెడ్డి, జంగారెడ్డి, మల్లికార్జున్ పాల్గొన్నారు.