కనగల్, మార్చి 25 : కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్, ఆలయ మాజీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ కార్యనిర్వణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్వేశిపురం గ్రామ సర్పంచ్ ఆర్.శేఖర్, భక్తుల సమక్షంలో ఆలయ హుండీలు తెరిచి లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జి.ఉమామహేశ్వరరావు, సినీయర్ అసిస్టెంట్ జె.చంద్రయ్య, జి.నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కె.ఉపేందర్ రెడ్డి, ఎన్.ఆంజనేయులు, కె.రాజయ్య, జే.నాగరాజు, సీహెచ్.శ్రీకర్, సాయి సేవా భక్త బృందం పాల్గొన్నారు.