దళితుల ఆర్థిక పురోభివృద్ధికే పథకం అమలు
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
ఆత్మకూరు(ఎం) మండలం మురిపాల, రాజాపేట
మండలం లక్ష్మక్కపల్లి గ్రామాల లబ్ధిదారులకు
దళిత బంధు యూనిట్ల అందజేత
ఆత్మకూరు(ఎం), జూన్15 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలన్ని పచ్చగా, పరిశుభ్రంగా మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి, ఖప్రాయపల్లి గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, కంపోస్ట్షెడ్లను, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములై గ్రామాలను హరిత వనాలుగా మార్చుకోవాలన్నారు. తమ ఇండ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవుల రాములు, ఏంపీఓ పద్మావతి, సర్పంచులు సామ వరలక్ష్మి, సుంకిశాల ఎల్లయ్య, ఎంపీటీసీలు సత్యనారాయణ, కవిత, వెంకటేశ్వర్లు, ఆర్ఐ యాదగిరి, ఏఈఓ సౌమ్య, పంచాయతీ కార్యదర్శులు దామోదర్రెడ్డి, జనరంజన్, ఉప సర్పంచ్ రషీద్, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ల పంపిణీ
ఆలేరురూరల్ : ఆత్మకూరు(ఎం) మండలం మురిపాల గ్రామం, రాజాపేట మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామాలకు చెందిన 29 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను బుధవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికే దళితబంధు అమలు చేస్తుంద న్నారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, రాజాపేట జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఎంపీడీఓ రామారాజు, సర్పచులు ఇంజం లక్ష్మీలక్ష్మణ్, తిరుమల్రెడ్డి పాల్గొన్నారు.