నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్ : పట్టణ ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను ఆరు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న మార్కెట్ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
మార్కెట్ నిర్మాణం పూర్తయితే స్వచ్ఛమైన వాతావరణంలో పట్టణ ప్రజలకు అన్నిరకాల కూరగాయలు, చికెన్, మటన్, చేపలు ఒకే దగ్గర దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ ధనలక్ష్మి, కౌన్సిలర్లు సైదులు, కొండ శ్రీను, విజయ్, స్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.