రామగిరి, ఫిబ్రవరి 1 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ)గా వర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి నియమితులయ్యారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి ఆదేశాల మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపేందర్రెడ్డి గతంలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేశారు. ప్రస్తుతం వర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ 2018 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘకాలం ఆ హోదాలో పనిచేశారు. కొత్తగా నియామకమైన ఉపేందర్రెడ్డికి గురువారం బాధ్యతలు అప్పగించారు. రమేశ్కుమార్కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆ విభాగం అధికారులు, సిబ్బంది కొత్త సీఓఈకి స్వాగతం పలికారు.
వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.జయంతి ఎంజీయూ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కో ఆర్డినేటర్గా నియమితులయ్యారు. అకాడమిక్ ఆడిట్ సెట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జక్క సురేశ్రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్గా డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ను నియమించారు. వర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ విభాగం డీన్గా ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ప్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్గా ప్రొఫెసర్ వసంత నియమితులయ్యారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి
వివిధ విభాగాలకు కొత్తగా నియామకమైన అధికారులంతా వర్సిటీ అభివృద్ధితోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రమశిక్షణ నేర్పిస్తే దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు, వర్సిటీ అనుబంధంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, యాజమాన్యాలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్తగా నియామకమైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.