నల్లగొండ రూరల్, ఆగస్టు 19 : మండలంలోని కూదావన్పూర్ గ్రామం గతంలో దోనకల్ ఆవాస గ్రామంగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక పంచాయతీగా ఏర్పాడింది. గ్రామంలో వెయ్యికి పైగా జనాభా ఉండగా 640 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి వారే అధికం. అయితే ఊరుకు ఆనుకోని ఏ ఎమ్మార్పీ కాలువ ఉంది. గ్రామంలోనికి వెళ్లి రావడానికి ఒకే ఒక బ్రిడ్జి ఉండేది. దాంతో ఆగ్రామ ప్రజలు నిత్యం ఆ బ్రిడ్జి గుండానే రావాలి, పోవాల్సి వచ్చేది. గ్రామస్తులకు సంబంధించి 850 ఎకరాల భూమి ఉంటే అందులో కాలువ ఇవతలిపై వైపు 300 ఎకరాలకు పైగా ఉన్నది. దాంతో 20 ఏండ్లుగా గ్రామస్తులు మరో బ్రిడ్జి నిర్మించాలని ఎంతో మందికి ప్రజాప్రతినిధులు, అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్నా పాపాన పోలేదు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి చొరవతో..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి చొరవతో గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి గతేడాది రూ. 40 లక్షలు మంజూరు కావడంతో మరో బ్రిడ్జిని నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దాంతో వారి కల నెరవేరింది. దూరభారాన్ని తగ్గిస్తూ ఏఎమ్మార్పీ కాలువపై బ్రిడ్జి ఏర్పాటుతో మేము ఎంతో సంతోషంగా ఉన్నామని, మాకు ఉన్న ఇంత పెద్ద సమస్యను పరిష్కరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎవ్వరూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలే
మాది గ్రామం వైపు ఏఎమ్మార్పీ కాలువ పక్కన రెండు ఎకరాలు, కాలువ అవతలి వైపు మరో రెండు ఎకరాల భూమి ఉంది. 20 ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ వ్యవసాయ పనులు నిమిత్తం మోటరు వేసి, సుమారు 2.5 కిలోమీటర్లు వెళ్లి పొలంలో నీటి మడులు కట్టెటోళ్లం. ఇన్నేండ్లుగా ఎవరూ పట్టించుకోలేదు. తె సర్కార్ చేసిన ఇంత మంచి పనికి సర్కార్కు అండగా ఉంటాం.
-అద్దెల వసంత, రైతు, కుదావన్పూర్
బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటాం
మా భూమి మొత్తం ఏఎమ్మార్పీ కాలువకు అవతలి వైపు ఉంది. గ్రామం నుంచి మా పొలానికి వెళ్లాలంటే దాదాపుగా 3 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ఎండ్లుగా బ్రిడ్జి నిర్మించాలని వేడుకొన్న పట్టించుకోలే. మా రైతుల కష్టాలు తెలిసిన బీఆర్ఎస్ సర్కార్ రూ. 40 లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో మా బాధాలు తీరా యి. బీఆర్ఎస్ సర్కారు మేలు మేము ఎప్పుడు మరవలేం.
-కొత్త లింగస్వామి, రైతు, కూదావన్పూర్
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కృషితోనే బ్రిడ్జి నిర్మాణం
కాల్వపై బ్రిడ్డి లేకపోవడంతో 20 ఏండ్లుగా అనేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషి దృష్టికి తీసుకెళ్లా. మంత్రి హరీశ్రావు పర్యటనలో భాగంగా మంత్రిని గ్రామానికి తీసుకొచ్చి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దాంతో నిధులు మంజూరు కావ డంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. మా గ్రామ రైతుల ఇన్నేండ్ల కలను నెరవేర్చినా బీఆర్ఎస్ సర్కార్కు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రుణపడి ఉంటాం.
-దూదిపాల జాన్రెడ్డి, సర్పంచ్, కుదావాన్పూర్